Telangana Geography Study Material
1.తెలంగాణ
తెలంగాణ ప్రాంతాన్ని పురాణాలలో దక్షిణాపథం అని పేర్కొంటారు.2. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్య ఘట్టాలు, సంఘటనలు
3. రాష్ట్ర భౌగోళిక విస్తరణ, విస్తీర్ణం, జనాభా
-పురుషులు – 1,76,11,633
-మహిళలు – 1,73,92,041
4. జిల్లాలు – వైశాల్యం
తెలంగాణాలోని మొత్తం జిల్లాలు 31. వాటి వైశాల్యం అవరోహణ క్రమంలో:
5. ఇతర రాష్ట్రాలతో సరిహద్దు
తెలంగాణ మొత్తం నాలుగు రాష్ర్టాలతో సరిహద్దు కలిగి ఉంది.
పశ్చిమం వైపు – కర్ణాటక
ఉత్తర వాయవ్యం వైపు – మహారాష్ట్ర
ఈశాన్యం వైపు – ఛత్తీస్గఢ్
తూర్పు ఆగ్నేయం వైపు – ఆంధ్రప్రదేశ్
గమనిక: ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలో ఉన్న ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడంతో తెలంగాణ ఒడిశాతో సరిహద్దును కోల్పోయింది.
కర్ణాటకతో సరిహద్దుగల జిల్లాలు
కర్ణాటకతో 5 తెలంగాణ జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:
కామారెడ్డి
సంగారెడ్డి
వికారాబాద్
మహబూబ్ నగర్
జోగులాంబ గద్వాల
మహారాష్ట్రతో సరిహద్దుగల జిల్లాలు
మహారాష్ట్రతో 6 తెలంగాణ జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:
నిజామాబాద్
నిర్మల్
అదిలాబాదు
కుంరం భీం ఆసిఫాబాద్
మంచిర్యాల
జయశంకర్ – భూపాలపల్లి
ఛత్తీస్గఢ్తో సరిహద్దుగల జిల్లాలు
ఛత్తీస్గఢ్తో కూడా 2 తెలంగాణ జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:
జయశంకర్ – భూపాలపల్లి
భద్రాద్రి – కొత్తగూడెం
ఆంధ్రప్రదేశ్తో సరిహద్దుగల జిల్లాలు
ఆంధ్రప్రదేశ్తోనూ 7 తెలంగాణ జిల్లాలు సరిహద్దు కలిగి ఉన్నాయి. అవి:
భద్రాద్రి – కొత్తగూడెం
ఖమ్మం
సూర్యాపేట
నల్లగొండ
నాగర్ కర్నూల్
వనపర్తి
జోగులాంబ గద్వాల
6. తెలంగాణ – నైసర్గిక స్వరూపం (Geographical Setting)
తెలంగాణ పురాతన గోండ్వానా ప్రాంతం నుంచి విడిపోయిన ద్వీపకల్ప భారతదేశంలో భాగంగా ఉన్నది.
రాష్ట్రంలోని 31 జిల్లాలు దక్కన్ పీఠభూమిలో భాగంగా ఉన్నాయి.
హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలు – గ్రానైట్ శిలలతో ఏర్పడిన టార్స్, బౌల్డర్స్ తదితర ఆకారాలతో ఏర్పడిన కొండలు, గుట్టలు విస్తరించి ఉన్నాయి.
రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల మధ్య ప్రాంతం – బసాల్ట్ లావాతో ఏర్పడిన కోత మైదానాలు.
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు – నీస్, గ్రానైట్ శిలలతో కూడి ఉన్నాయి.
నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ – భూపాలపల్లి, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలు గోదావరి నది లోయలో భాగంగా ఉండటం వలన పురాతన గోండ్వానా శిలలతో బొగ్గు నిక్షేపాలు ఏర్పడి ఉన్నాయి.
గోండ్వానా శిలలు తెలంగాణలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.
తెలంగాణ ప్రాంతం సముద్రమట్టానికి 480 నుంచి 600 మీ. ఎత్తులో ఉంది.
హైదరాబాద్ 600 మీటర్ల ఎత్తులో ఉంది.
కృష్ణా-తుంగభద్ర నది లోయల మధ్య ప్రాంతం- 300-450 మీ.
భీమా-గోదావరి నదుల మధ్య ప్రాంతం (హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మధ్య ప్రాంతం) – 730 మీ.
మెదక్, మహబూబ్నగర్ జిల్లాల మధ్య ప్రాంతం – 600-900 మీ. ఎత్తులో విస్తరించి ఉంది.
దక్కన్ పీఠభూమి వాయవ్య దిశ నుంచి ఆగ్నేయ దిశకు వాలుగా ఉన్నందున గోదావరి, కృష్ణా మొదలైన నదులు అన్ని తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
దక్కన్ పీఠభూమి తూర్పునగల తూర్పు కనుమలు, దక్షిణానగల పశ్చిమ కనుమలు రెండు తెలంగాణలోకి ప్రవేశించాయి.
పశ్చిమ కనుమలను సహ్యాద్రి/సత్నాల పంక్తిగా పిలుస్తారు.
తెలంగాణ ప్రాంతంలోకి పడమటి కనుమలు/సహ్యాద్రి పర్వతాలు అజంతా శ్రేణి నుంచి విడిపోయి ఆగ్నేయ దిశగా ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించాయి.
తూర్పు కనుమలు నిర్మాణం దృష్ట్యా తూర్పు కొండలుగా మహబూబ్నగర్ నుంచి తెలంగాణలోకి విస్తరించాయి.
తెలంగాణలో తూర్పు కనుమలు ఏక శ్రేణిగా ఉండకుండా గుట్టలు, కొండలుగా ఉండి ప్రాంతీయ పేర్లతో పిలువబడుతున్నాయి.
తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ – లక్ష్మీదేవిపల్లి కొండ. ఇది సిద్దిపేట జిల్లాలో ఉంది.
తెలంగాణలో పశ్చిమ కనుమల్లో (ఆదిలాబాద్ జిల్లా) ఎత్తైన శ్రేణి – మహబూబ్ఘాట్
7. వివిధ జిల్లాల్లో గల కొండలు, గుట్టలు, వాటి పేర్లు
ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లాలు:
నిర్మల్ పంక్తులు
సత్నాల కొండలు
గోతి కొండలు
సిర్పూర్ కొండలు
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు:
రాఖీ కొండలు
రామగిరి కొండలు
వరంగల్, జయశంకర్ – భూపాలపల్లి జిల్లాలు:
కందికల్ కొండలు
హన్మకొండ
పాండవుల గుట్టలు
ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలు:
పాపికొండలు
యల్లండ్లపాడు గుట్టలు
రాజుగుట్టలు
గోదావరి నది పాపికొండలను చీలుస్తూ ప్రవహిస్తుంది.
నల్లగొండ, యాదాద్రి – భువనగిరి జిల్లాలు:
యాదాద్రి గుట్టలు
భువనగిరి కొండలు
నాగార్జున కొండలు
నంది కొండలు
నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
నాగార్జున కొండ వద్ద బౌద్ధుల మ్యూజియం ఉంది.
యాదాద్రి గుట్టపై శ్రీలక్ష్మీనర్సింహస్వామి దేవాలయం ఉంది.
మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలు:
నల్లమల కొండలు
అమ్రాబాద్ కొండలు
షాబాద్ కొండలు
నల్లమల కొండలు కృష్ణా-పెన్నా నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. వీటి సగటు ఎత్తు 520 మీ.
షాబాద్ కొండలు డిండి నదికి జన్మస్థలం.
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు:
అనంతగిరి కొండలు
అనంతగిరి కొండలు మూసీ నదికి జన్మస్థలం. ఇది వికారాబాద్లోని శివారెడ్డిపేట వద్ద ఉంది. ఇది వన మూలికలకు ప్రసిద్ధిచెందింది. ఈ కొండల్లో అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉంది.
హైదరాబాద్ జిల్లా:
గోలకొండ
రాచకొండ
రాచకొండ దక్షిణ-తూర్పు దిశలో నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకా వరకు, పశ్చిమ దిశలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల వరకు, దక్షిణ దిశలో మహబూబ్నగర్ జిల్లా షాబాద్ కొండల వరకు విస్తరించి ఉంది.
నోట్ : హైదరాబాద్-మహబూబ్నగర్ జిల్లాల్లో వ్యాపించిన కొండలు బాలాఘాట్ పర్వతాలకు చెందినవి.
మెదక్, సిద్ధిపేట జిల్లాలు:
బూజు గుట్టలు
లక్ష్మిదేవునిపల్లి కొండలు
లక్ష్మిదేవునిపల్లి కొండలు తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండలు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు:
సిర్నాపల్లి కొండలు (ఖాయితీ లంబాడీలు)
రాతి కొండలు (ఇటీవల చెల్లప్ప కమిటీ గుర్తించింది)
సిర్నాపల్లి కొండలు సిర్నాపల్లి నుంచి ఆర్మూర్ వరకు విస్తరించి ఉన్నాయి.
గోండ్వానా శిలలు
రాష్ట్రంలో గోండ్వానా శిలలు గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి.
గోండ్వానా శిలల్లో ప్రధాన ఖనిజం – నేలబొగ్గు
రాష్ట్రంలో నేలబొగ్గును వెలికితీసే సంస్థ – సింగరేణి. దీన్ని 1921లో సింగరేణిలో స్థాపించారు.
సింగరేణి ప్రధాన కార్యాలయం – కొత్తగూడెం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, 1920 స్థాపన)
రాష్ట్రంలో నేలబొగ్గు అత్యధికంగా లభించే జిల్లాలు 1) భద్రాద్రి కొత్తగూడెం, 2) జయశంకర్ – భూపాలపల్లి, 3) పెద్దపల్లి, 4) మంచిర్యాల, 5) కుమ్రం భీం ఆసిఫాబాద్
8. శీతోష్ణస్థితి (Climate)
రాష్ర్టానిది ఆయన రేఖా రుతుపవన శీతోష్ణస్థితి
రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత మేలో నమోదవుతుంది.
అత్యధిక ఉష్ణోగ్రత కొత్తగూడెంలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెంటిగ్రేడ్
సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెంటిగ్రేడ్
9. వర్షపాతం (Rainfall)
రాష్ట్రంలో సగటు వర్షపాతం 906.6 మి.మీ.
2004-05లో నమోదైన వర్షపాతం 614 మి.మీ.
2013-14లో నమోదైన వర్షపాతం 1212 మి.మీ.
2013-14లో అత్యధిక సగటు వర్షపాతం ఆదిలాబాద్ 1158 మి.మీ.
అత్యల్ప సగటు వర్షపాతం మహబూబ్నగర్ 604 మి.మీ.
10. నదులు (Rivers)
నదులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం- పాటమాలజీ
సరస్సులను గురించి అధ్యయనం చేసే శాస్త్రం- లిమ్నాలజీ
నీటిని గురించి అధ్యయనం చేసే శాస్త్రం- హైడ్రాలజీ
ప్రపంచ నదుల దినోత్సవం- సెప్టెంబర్ చివరి ఆదివారం
ప్రపంచ నీటి దినోత్సవం- మార్చి 22
భారతదేశ నదీ వారం- నవంబర్ 24-27 (ఇది మొదటిసారి ఢిల్లీలో 2014లో జరిగింది)
రాష్ట్ర భూభాగం వాయవ్యాన ఎత్తుగా ఉండి ఆగ్నేయ దిశగా వాలి ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ వాయవ్యం నుంచి ఆగ్నేయం వైపు ఉంటుంది.
రాష్ట్రంలో ప్రవహించే ముఖ్యమైన నదులు- గోదావరి, కృష్ణా, మంజీర, మూసీ, తుంగభద్ర
10.1 గోదావరి నది
పొడవు- 1465 కి.మీ. (910 మైళ్లు)
ప్రవహించే రాష్ర్టాలు- మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
పరివాహక రాష్ర్టాలు- మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి
జన్మస్థలం- పశ్చిమ కనుమలు/సహ్యాద్రి పర్వతాల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్దగల నాసిక్ త్రయంబకేశ్వరంలోని బిల సరస్సు సముద్ర మట్టం నుంచి ఎత్తు- 920 మీ. (3018 అడుగులు)
రాష్ట్రంలోని గోదావరి మొత్తం పొడవు- 550 కి.మీ.
గోదావరి నది పరివాహక ప్రాంతం దేశ భూభాగంలోని 10 శాతం భూభాగాన్ని ఆక్రమించింది.
ఇది దేశంలో రెండో పొడవైన నది
ఇది దక్షిణభారతదేశంలో పొడవైన నది
ఈ నదికి వృద్ధ గంగ, దక్షిణ గంగ, ఇండియన్ రైన్ అని పేర్లు ఉన్నాయి.
ఈ నది నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద మంజీర, హరిద్రా నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పర్చింది.
అంతేకాకుండా జయశంకర్ – భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ప్రాణహిత, మానేరు నదులతో కలిసి త్రివేణి సంగమం ఏర్పర్చింది.
నదీ ప్రవాహం: గోదావరి నది పశ్చిమ కనుమల్లోని మహారాష్ట్రలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద గల నాసికా త్రయంబకేశ్వరం వద్ద జన్మించి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా కందుకుర్తి వద్ద ప్రవేశించి నిర్మల్ జిల్లా బాసర గుండా నిర్మల్, నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో ప్రవహిస్తూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (పోచంపాడు)ను దాటి నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ – భూపాలపల్లి, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాల గుండా ప్రవహిస్తూ పాపికొండలను చీలుస్తూ బైసన్ గార్జ్ను ఏర్పర్చి పోలవరం (తెలంగాణ-ఆంధ్ర సరిహద్దులో) వద్ద విశాలమైదానంలోకి ప్రవేశించి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు గుండా ప్రవహిస్తూ రాజమండ్రికి దిగువభాగాన, ధవలేశ్వరం వద్ద 5 ప్రధాన పాయలు (మొత్తం 7 పాయలు)గా చీలి ఒక్కో పాయ ఒక్కో ప్రాంతం వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి.
పాయలు
1) గౌతమి – ఉత్తర శాఖ యానాం వద్ద
2) వశిష్ట – మధ్య శాఖ అంతర్వేది వద్ద
3) వైనతేయ – దక్షిణ శాఖ కొమరగిరి పట్నం వద్ద
4) తుల్య
5) భరద్వాజ – బెండమూరులంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తాయి.
తుల్య, భరద్వాజ పాయల మధ్యలోకి కౌశిక, ఆశ్రేయ అనే పాయలు చేరి ఒకేపాయగా ప్రవహిస్తూ బెండమూరులంక వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
గోదావరి నదికి ఎడమవైపు జిల్లాలు – నిర్మల్, మంచిర్యాలకుడివైపు జిల్లాలు – నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ – భూపాలపల్లి
ఉప నదులు –
ప్రవర (మహారాష్ట్ర)
మంజీర (తెలంగాణ)
పెద్దవాగు (తెలంగాణ)
మానేరు (తెలంగాణ)
కిన్నెరసాని (తెలంగాణ)
పూర్ణ (మహారాష్ట్ర)
పెన్గంగ (తెలంగాణ)
వార్ధా (తెలంగాణ)
వెయిన్గంగ (తెలంగాణ)
ప్రాణహిత (తెలంగాణ)
ఇంద్రావతి (తెలంగాణ)
శబరి (తెలంగాణ)
సీలేరు (ఏపీ)
తాలిపేరు (ఏపీ)
తెలంగాణలో కుడివైపు నుంచి కలిసే ఉపనదులు: 1) మంజీర 2) మానేరు 3) పెద్దవాగు 4) కిన్నెరసాని
ఎడమవైపు నుంచి కలిసే ఉపనదులు: 1) ప్రాణహిత 2) ఇంద్రావతి 3) శబరి 4) సీలేరు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టు 1963, జూలై 26న ప్రారంభమైంది. దీనిని నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద గోదావరి నదిపై నిర్మించారు.
దీని వల్ల నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ జిల్లాలు ప్రయోజనం పొందుతున్నాయి. దాదాపు 3.97 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరందుతుంది.
ప్రాజెక్టుకు కాకతీయ, సరస్వతి, లక్ష్మీ అని మూడు కాలువలు ఉన్నాయి. అయితే ప్రధానమైనది మాత్రం కాకతీయ కాలువ.
ఇది కొన్ని జాతీయ ప్రాజెక్టులకు నీరందిస్తున్నది. దీని పూర్వనామం పోచంపాడు ప్రాజెక్టు.
గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్ట్ అయిన దీన్ని మాజీ ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. దీని గరిష్ట ఎత్తు 1,091 అడుగులు.
గోదావరి తీరాన గల ముఖ్యమైన పట్టణాలు
నాసిక్, నాందేడ్ (మహారాష్ట్ర)
బాసర (నిర్మల్)
ధర్మపురి (జగిత్యాల)
మంచిర్యాల
భద్రాచలం
గోదావరి తీరాన గల పుణ్యక్షేత్రాలు
బాసర – జ్ఞాన సరస్వతి దేవాలయం
ధర్మపురి – లక్ష్మీనర్సింహ స్వామి, యమధర్మరాజు ఆలయాలు
గూడెం – సత్యనారాయణ స్వామి ఆలయం
కాళేశ్వరం – కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు
భద్రాచలం – సీతారామచంద్రస్వామి ఆలయం
గోదావరిపై గల ఎత్తిపోతల పథకాలు
అలీసాగర్ – కోసీ (నవీపేట, నిజామాబాద్)
యంచ – యంచ (నిజామాబాద్)
అర్గుల్ రాజారాం – ఉమ్మెడ (నవీపేట, నిజామాబాద్)
చౌట్పల్లి హన్మంత్రెడ్డి – సేట్పల్లి (నిజామాబాద్)
కడెం (కడెం నారాయణరెడ్డి)- పెద్దూరు (నిర్మల్)
ప్రాణహిత-చేవెళ్ల – తుమ్మిడిహట్టి (ఆసిఫాబాద్)
ఎల్లంపలి (శ్రీపాదసాగర్)- ఎల్లంపల్లి (పెద్దపల్లి, మంచిర్యాల)
కాళేశ్వరం – కన్నెపల్లి (భూపాలపల్లి)
దేవాదుల (జే చొక్కరావు ఎత్తిపోతల)- గంగాపురం
కంతనపల్లి – కంతనపల్లి
దుమ్ముగూడెం (జ్యోతిరావు ఫూలే ఎత్తిపోతల)- అనంతారం (ఖమ్మం)
గోదావరి ఉపనదులు:
మంజీర నది:
మొత్తం పొడవు- 644 కి.మీ.
ఈ నది మహారాష్ట్రలోని బాలాఘాట్ పర్వతాల్లోని జామ్ఖేడ్కొండ (భీడ్ జిల్లాలోని పటోడ
11. నీటిపారుదల సౌకర్యాలు
వర్షపాతం ద్వారా కాకుండా ఇతర కృత్రిమ పద్ధతుల ద్వారా పంటలకు నీటి సరఫరా చేయడాన్ని ‘నీటిపారుదల’ అంటారు.
రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో నీటిపారుదల కింద ఎక్కువ భూమి సాగవుతుంది.
నీటిపారుదల సౌకర్యాలను మూడు వర్గాలుగా విభజించారు. అవి:
1.బావులు
బావుల ద్వారా అత్యధికంగా నీటిపారుదల గల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, రాజస్థాన్.
రాష్ట్రంలో దాదాపు 23 లక్షల ఎకరాలు బావుల ద్వారా సాగవుతుంది.
2.కాలువలు
కాలువల ద్వారా అత్యధికంగా నీటిపారుదలగల రాష్ట్రాలు- తెలంగాణ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానా.
రాష్ట్రంలో కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న జిల్లాలు- కరీంనగర్, వరంగల్, ఖమ్మం
రాష్ట్రంలో మొత్తం 4.7 లక్షల హెక్టార్లు కాలువల ద్వారా సాగవుతున్నది.
3.చెరువులు
రాష్ట్రంలో చెరువుల ద్వారా సాగవుతున్న భూమి 2.83 లక్షల హెక్టార్లు. అత్యధికంగా సాగవుతున్న జిల్లా వరంగల్.
అత్యధికంగా చెరువుల ద్వారా నీటిపారుదల అవుతున్న రాష్ట్రాలు- ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, యూపీ.
12. నేలలు
భూమి ఉపరితలంపై వదులుగా ఉన్న పొరనే ‘నేల’ అంటారు.
నేలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజి’ అంటారు.
శిలలు శైథిల్యం చెందగా ఏర్పడే పదార్థాన్ని ‘మృత్తిక అంటారు.
తెలంగాణ రాష్ట్రం భారత ద్వీపకల్పంలోని ఈస్ట్రన్ సీ బోర్డ్ మధ్య పేలికలో దక్కన్ పీఠభూమిపై ఉంది.
తెలంగాణ రాష్ట్రం అధిక సారవంతమైన ఒండ్రు నేలల నుంచి నిస్సారమైన ఇసుక నేలల వరకు పలు రకాల నేలలను కలిగి ఉంది.
తెలంగాణలో ఎగుడు, దిగుడులుగల పెనిప్లేయిన్లు కలిగి ఉన్నప్పటికీ ఎర్ర నేలలు, నల్ల నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.
రాష్ట్రంలో ప్రధానంగా ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు, నల్లరేగడి నేలలు, లాటరైట్ నేలలు విస్తరించి ఉన్నాయి.
-మృత్తికల నిర్మాణం ఎలా జరుగుతుందో తెలిపే శాస్త్రం – లిథాలజి
ICAR (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చ్) న్యూఢిల్లీ సంస్థ దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది.
ఎర్ర నేలలు
రాష్ట్రంలో అధిక భాగం ఎర్ర నేలలు ఉన్నాయి.
ఈ నేలల్లో మొక్కలకు కావాల్సిన పౌష్టిక, సేంద్రియ పదార్థాలు తక్కువ, భాస్వరం అధికంగా ఉంటుంది.
తెలంగాణలో ఈ నేలలను చెల్క, దుబ్బ నేలలుగా వర్గీకరించారు. అందులో చెల్క నేలలు క్వార్ట్జైట్, ముడి గ్రానైట్ రాళ్లు రూపాంతరం చెందడంవల్ల ఏర్పడుతాయి. చెల్క నేలలు చాలా దిగువగా అంటే గుట్టల మధ్య భాగం వాలు భూముల్లో ఎక్కువగా ఉంటాయి.
దుబ్బ నేలలు తక్కువ సారవంతం కలిగి ఉండి పాలిపోయిన బూడిద రంగులో ఉంటాయి.
ఈ ఎర్ర నేలల్లో ప్రధానంగా వేరుశనగ పండుతుంది.
ఎర్ర నేలలు వదులుగా ఉంటాయి.
ఈ ఎర్ర నేలలు రాష్ట్రంలోని మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, నిజామాబాద్లలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ నేలలు తక్కువగా ఉన్నాయి.
ఈ నేలలు రాష్ట్ర విస్తీర్ణంలో 48 శాతం విస్తరించి ఉన్నాయి.
నల్లరేగడి నేలలు
అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన్ పీఠభూమిలో లావా, నీస్, గ్రానైట్ శిలలపై ఈ మృత్తికలు ఏర్పడుతాయి.
ఇవి ఎక్కువగా బంకమట్టితో ఉండి, తేమను నిల్వ ఉంచుకునే శక్తి కలిగి ఉంటాయి.
ఈ నేలలను ‘రేగర్ నేలలు’ అంటారు.
ఈ నేలల్లో ఇనుము, కాల్షియం శాతం ఎక్కువగా, భాస్వరం, నైట్రోజన్, సేంద్రియ పదార్థం శాతం తక్కువగా ఉంటాయి.
ఈ నేలలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, నిజామాబాద్, కామారెడ్డిలలో ఎక్కువగా కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్లలో తక్కువగా విస్తరించి ఉన్నాయి.
ఈ నేలల్లో ప్రధానంగా పత్తి, పొగాకు, పసుపు, మిరప, సజ్జ, జొన్న పంటలు అధికంగా పండుతాయి.
రాష్ట్రంలో ఈ నేలలు 25 శాతం విస్తరించి ఉన్నాయి.
ఈ నేలలు తేమను చాలా కాలం నిల్వ ఉంచుకుంటాయి.
రాతి నేలలు (లాటరైట్ నేలలు)
ఈ నేలలు దేశంలో 4.3 శాతం విస్తరించాయి.
రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల్లో ఈ నేలలు 25 శాతం విస్తరించి ఉన్నాయి.
ఈ నేలలు తడిసినప్పుడు మెత్తగా ఉండి, ఎండినప్పుడు గట్టిగా ఉంటాయి. అందుకే వీటిని ‘బ్రిక్ సాయిల్’ అంటారు.
ఈ నేలలు ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటాయి.
ఈ నేలలు అల్యూమినియం, ఇనుముల హైడ్రైడ్ ఆకై్సడ్ మిశ్రమం.
ఈ నేలలు వర్షానికి తడిచి నల్లగా మారుతాయి.
ఇవి ఎక్కువ వర్షపాతం, అధిక తేమ, ఎక్కువ ఉష్ణోగ్రతగల ప్రాంతాల్లో ఏర్పడుతాయి.
ఈ నేలలు మెదక్, ఖమ్మం జిల్లాల్లో మాత్రమే విస్తరించి ఉన్నాయి.
ఈ నేలలు పీత వర్ణం, గోధుమ, ఎరుపు రంగులను కలిగి ఉంటాయి.
ఈ నేలతో ఇటుకలు తయారు చేస్తారు.
ఈ నేలలో కాఫీ, తేయాకు, రబ్బరు, జీడి మామిడి, సుగంధ ద్రవ్య పంటలు ఎక్కువగా పండుతాయి.
ఒండ్రు నేలలు
ఈ నేలలు నదులు అనేక ఏండ్లుగా తమ ప్రవాహ క్రమంలో తీసుకొచ్చిన ఒండ్రుమట్టిని నిక్షేపణం చేయటం వలన ఏర్పడుతాయి.
ఈ నేలలు తెలంగాణ విస్తీర్ణంలో 3వ స్థానాన్ని ఆక్రమించాయి.
ఈ నేలలు నీటిని నిలువ చేసుకుంటాయి.
13. అడవులు
FOREST అనే ఆంగ్ల పదం ‘FORES’ అనే లాటిన్ భాషా పదం నుంచి వచ్చింది.
‘FORES’ అంటే గ్రామం వెలుపలి ప్రాంతం అని అర్థం.
ప్రపంచ అటవీ దినోత్సవం – మార్చి 21
1952 జాతీయ అటవీ విధాన తీర్మానం ప్రకారం మొత్తం దేశ భూభాగంలో 33.3 శాతం అడవులు కలిగి ఉండాలి. కానీ దేశ భూభాగంలో 20.5 శాతం మాత్రమే అడవులున్నాయి.
2011ను UNO అటవీ సంవత్సరంగా ప్రకటించింది.
రాష్ట్రంలో ఎక్కువ విస్తీర్ణం అడవులుగల జిల్లా ఖమ్మం, తర్వాత స్థానం ఆదిలాబాద్ జిల్లాది. అడవులు లేని జిల్లా హైదరాబాద్.
నల్లగొండ జిల్లాలో 6.03 శాతంతో అతి తక్కువ అడవులున్నాయి.
ప్రస్తుత ధరల ప్రకారం 2014-15లో రాష్ట్ర GSDPలో అటవీ సంపద, కలప రంగం 0.9 శాతం వాటాను కలిగి ఉండగా, వ్యవసాయ రంగం 5.02 శాతం వాటాను కలిగి ఉంది.
రాష్ట్రంలో సామాజిక అడవులతో కలిపి అటవీ విస్తీర్ణం 29,242 చ.కి.మీ.
అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం 12వ ర్యాంకులో ఉంది.
-రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీర్ణ శాతం – 30 శాతం
రిజర్వ్డ్ అటవీ విస్తీర్ణం – 21,024 చ.కి.మీ.
రక్షిత అటవీ విస్తీర్ణం – 7,468 చ.కి.మీ.
అత్యధిక అటవీ విస్తీర్ణంగల జిల్లాలు – 4 (1. ఖమ్మం 2. ఆదిలాబాద్ 3. వరంగల్ 4. మహబూబ్నగర్)
అత్యల్ప అటవీ విస్తీర్ణంగల జిల్లాలు – 4 (1.హైదరాబాద్ 2. రంగాడ్డి 3. నల్లగొండ 4. మెదక్)
ప్రస్తుత ధరల ప్రకారం వ్యవసాయ రంగంలో అటవీ వాటా – 5.02 శాతం.
నిజామాబాద్ జిల్లాలో దొరికే రూసా గడ్డి నుంచి సుగంధ తైలాన్ని తీస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ తెలంగాణ అడవుల్లో అడ్డాకులు, బంక, తేనె, చింతపండు, ఉసిరి, కుంకుడు లభ్యమవుతున్నాయి.
రాష్ట్రంలోని నిజామాబాద్ నుంచి నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి గుండా కొత్తగూడెం జిల్లా వరకు గోదావరి నది ఒడ్డు వెంట దట్టమైన అడవులున్నాయి.
సవరించిన 2002 రాష్ట్ర విధానం ‘విజన్ 2020’ ప్రకారం అటవీ శాఖ ప్రస్తుతం ఉన్న అడవుల సంరక్షణ, అభివృద్ధి, ఉత్పాదకత, ఆర్థిక విలువ పెంపుదల కోసం పలు రకాల అభివృద్ధి కార్యక్షికమాలను అమలు చేస్తోంది.
రాష్ట్రంలో 2,939కి పైగా మొక్క జాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరద జాతులు, 28 సరీసృపాలు, 21 ఉభయచర జాతులు వీటితోపాటు పెద్ద సంఖ్యలో అకశేరుకాలు ఉన్నాయి.
అడవులు – రకాలు
1.ఆర్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు:
ఈ అరణ్యాలు 125-200 సెం.మీ వర్షపాతంగల ప్రాంతాల్లో పెరుగుతాయి.
ఈ అడవుల్లో పెరిగే ముఖ్యమైన చెట్లు వేగి, మద్ది, జిట్టగి మొదలైనవి.
అనేక రకాల కలప కూడా లభ్యమవుతుంది.ఈ అడవులు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్నగర్లలో విస్తరించి ఉన్నాయి.
2.అనార్థ్ర ప్రాంతంలోని ఆకురాల్చే అడవులు:
ఈ అడవులు 75-100 సెం.మీ వర్షపాతంగల ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి.
ఈ అడవుల్లో ముఖ్యమైన చెట్లు వెలగ, వేప, దిరిశెన, బూరుగు, వెదురు మొదలైనవి. కలప కూడా లభ్యమవుతుంది.
ఈ అడవులు ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి.
3.ముళ్లతో కూడిన పొద అడవులు
వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి.
ఈ అడవులు నల్లగొండ, రంగాడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
అడవుల్లో తుమ్మ, రేగు చెట్లు పెరుగుతాయి.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ 2013 ప్రకారం తెలంగాణలో అడవుల శాతం
14. వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు
శివ్వారం మొసళ్ల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ వన్యవూపాణి సంరక్షణ కేంద్రం – మంచిర్యాల జిల్లా
ఖమ్మం – కిన్నెరసాని మొసళ్ల సంరక్షణ కేంద్రం
వరంగల్ – ఏటూరు నాగారం వన్యవూపాణి సంరక్షణ కేంద్రం
హైదరాబాద్ – మహావీర్ హరిణ వనస్థలి
నల్లగొండ – నాగార్జున సాగర్ మొసళ్ల సంరక్షణ కేంద్రం
మహబూబ్నగర్ – పిల్లలమర్రి
మెదక్ – మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రం
రాష్ట్రంలో అటవీ అభివృద్ధి ఏజెన్సీలు మూడంచెల వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతున్నాయి. అవి:
రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి ఏజెన్సీ (స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ – SFDA)
డివిజన్ స్థాయిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఫాస్ట్ డెవలప్మెంట్ ఏజెన్సీ – FDA)
గ్రామ స్థాయిలో వన సంరక్షణ సమితి (VSS)
రాష్ట్రంలో అటవీ సంబంధిత సంస్థలు
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి
అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం, దూలపల్ల్లి
ఫారెస్ట్ రిసెర్చ్ డివిజన్ హైదరాబాద్, వరంగల్
స్టేట్ ఫారెస్ట్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్, హైదరాబాద్
ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం, ములుగు
రాష్ట్ర చిహ్నాలు
రాష్ట్ర పక్షి – పాలపిట్ట (శాస్త్రీయనామం – కొరాషియస్ బెంగాలెన్సిస్)
రాష్ట్ర జంతువు – మచ్చల జింక (శాస్త్రీయనామం – ఆక్సిస్ ఆక్సిస్)
రాష్ట్ర వృక్షం – జమ్మిచెట్టు (శాస్త్రీయనామం -ప్రోసోఫిస్సినరేరియా)
రాష్ట్ర పుష్పం – తంగేడు (శాస్త్రీయనామం – కేసియా అరిక్యులేటా)
రాష్ట్ర పండు -సీతాఫలం (శాస్త్రీయనామం – అనోనా స్కామోజా)
రాష్ట్ర చిహ్నం – కాకతీయ కళాతోరణం కింద చార్మినార్, కాకతీయ కళాతోరణంపై సింహతలాటం, చుట్టూ తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూభాషల్లో తెలంగాణ ప్రభుత
ATTENTION APPSC GROUP-2 MAINS ASPIRANTS! DO YOU KNOW APPSC CONDUCTING MAINS EXAMS ONLINE ONLY? YOU MUST PRACTICE ONLINE EXAMS TO GAIN THE CONFIDENCE AND BE A WINNER!.
[maxbutton id=”1″ text=”Register for Test Series” url=”https://vyoma.net/exams/appsc/”]