Telugu Current Affairs One Liners 01 June 2018
Telugu Current Affairs One Liners 01 June 2018
>ఫతే హైదరాబాద్ నిర్వహించిన డెక్కన్ ఫుట్బాల్ కప్లో అబ్బాస్ యూనియన్ ఛాంపియన్గా అవతరించింది
>ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్లకు జక్కా వైష్ణవిరెడ్డి (తెంగాణ), లక్ష్య సేన్ సారథ్యం వహిస్తారు
>ఐపీఎల్-2009 సందర్భంగా ఫెమా నిబంధను ఉ్లంఘించినందుకు BCCI, బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడి, ఇతరులకు ఈడీ రూ.121 కోట్ల జరిమానా విధించింది.
>గోల్డ్కోస్ట్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత వెయిట్లిఫ్టర్ సంజిత చాను (53 కేజీ) డోప్ పరీక్షల్లో విఫలమైంది
>ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ఛైర్మన్గా చంద్రశేఖర్ రాజనాలు ఎన్నికయ్యారు
>యూరోపియన్ యూనియన్(ఈయూ), కెనడా, అమెరికా నుంచి వచ్చే ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై సుంకాల మినహాయింపును ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది
>భారత ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో అంచనాకు మించి రాణించింది
>పాకిస్థాన్ 14వ జాతీయ అసెంబ్లీ రద్దు 2018 మే 31న రద్దయింది.
దీంతో పాకిస్థాన్లో తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రెండు ప్రభుత్వాలు వరుసగా పూర్తి పదవీ కాలంపాటు నిలబడిన రికార్డు నమోదయింది
>టైమ్స్ ప్రపంచస్థాయి ఉన్నత విద్యాసంస్థల ర్యాంకింగ్స్-2018లో భారత్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc-బెంగళూరు), 100 స్థానాల్లో చోటు దక్కించుకుంది
>హవాయిలో ఉన్న సైనిక స్థావరం పసిఫిక్ కమాండ్ను ఇండో-పసిఫిక్ కమాండ్గా పేరు మార్చుతూ అమెరికా ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది
>పినాక రాకెట్కు సంబంధించిన మెరుగుపరచిన వెర్షన్ను భారత్ 2018 మే 31న విజయవంతంగా పరీక్షించింది
>మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పాండురంగ ఫుండకర్(67) 2018 మే 31న ముంబయిలో గుండెపోటుతో మృతిచెందారు
>రోగి స్పృహలో ఉండగానే అతనికి విజయవంతగా శస్త్రచికిత్స చేసిన ఘటన బెంగళూరు భగవాన్ మహావీర్ వైద్యశాలలో చోటుచేసుకుంది
>రాష్ట్రంలోని 11 జిల్లాలనుODF (ఆరు బయట మల విసర్జన రహిత) జిల్లాలుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ధరించింది
>కోరుకున్న రైలులో సీటు/బెర్త్ దొరకకపోతే అదేరోజు తర్వాత బయల్దేరే ఏ రైలులోనైనా కేటాయించేలా అమలు చేస్తున్న వికల్ప్ సౌకర్యాన్ని రైల్వేశాఖ ఇకపై సాధారణ రిజర్వేషన్ కౌంటర్లలోనూ అందుబాటులోకి తెచ్చింది
>మధ్యతరగతికి కూడా అందుబాటులో ఉండేలా సరికొత్త నానో, అల్ట్రా టెక్నాజీతో జల శుద్ధి విధానాలను భారత రసాయన సాంకేతిక సంస్థ (CSIR-IICT) తయారు చేసింది
>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన 2018 మే 31న అమరావతిలో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు
>తమ సంపదలో సగానికన్నా ఎక్కువ మొత్తాన్ని విరాళాలుగా ఇస్తామని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, ఆయన భార్య రోహిణి నీలేకని ప్రకటించారు
>మూడు దేశాల పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడి 2018 మే 31న సింగపూర్కు చేరుకున్నారు.